ఢిల్లీ ఏయిర్‌పోర్టులో రూ.11కోట్ల డ్రగ్స్ పట్టివేత

by  |
ఢిల్లీ ఏయిర్‌పోర్టులో రూ.11కోట్ల డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్టులో అప్ఘనిస్తాన్ దేశస్థుల నుంచి 1.63కేజీల డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రెగ్యూలర్ విధుల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేయగా వారి నుంచి క్యాప్యుల్స్ రూపంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు రూ.11కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ను హెరాయిన్‌గా గుర్తించారు. దీంతో ఇద్దరు నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్-1985 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed