ఉగ్రవాదుల భారీ స్కెచ్ భగ్నం.. 19 గ్రెనేడ్లు స్వాధీనం

by  |
ఉగ్రవాదుల భారీ స్కెచ్ భగ్నం.. 19 గ్రెనేడ్లు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేశాయి. వివరాల ప్రకారం.. జమ్ము-పూంచ్ నేషనల్ హైవే(144ఏ)లో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేయడానికి గ్రెనేడ్లు అమర్చారు. అయితే, భద్రతా దళాల అధికారులకు ముందస్తు సమాచారం అందండంతో.. ఉగ్రవాదుల స్థావరం గుర్తించి 19 గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సురంకోట్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed