నిజామాబాద్‌లో 19 పాజిటివ్ కేసులు

by  |
నిజామాబాద్‌లో 19 పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శనివారం 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో 52 షాంపిళ్లు సేకరించగా అందులో 31 నెగిటివ్ రాగా,19 పాజిటివ్ నిర్దారణ అయ్యాయని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ముగ్గురు వైద్యులకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఈ రోజు 2 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అయితే, 129కు పైగా శాంపిళ్లు సేకరిస్తే 2 పాజిటివ్ కేసులకు సంబంధించి రిపోర్టులు ఇవ్వడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కేవలం మూడు పరీక్షల రిపోర్టులను ప్రకటించడంతో కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 131 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed