తెలంగాణ టు ఆంధ్రా.. 1870 సీసాల మద్యం పట్టివేత

by  |
తెలంగాణ టు ఆంధ్రా.. 1870 సీసాల మద్యం పట్టివేత
X

దిశ, అమరావతి బ్యూరో: తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న1870 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దందా బయటపడింది. నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై మద్యం బాటిళ్లను మూటల్లో కట్టుకుని తీసుకు వస్తుండగా పోలీసులు అడ్డగించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా మద్యం సీసాలు కనిపించాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.


Next Story

Most Viewed