భయానక రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

by  |
భయానక రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో భయానక రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మందికి పైగా వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలతో నవద్వీప్ శ్మశాన వాటికవైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ ట్రక్కును హై స్పీడ్‌లో మోటాడోర్ వాహనం బలంగా ఢీకొట్టింది.

దీంతో ఘటన స్థలంలోనే పలువురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed