ఘోర రైలు ప్రమాదం.. 17 మంది వలస కూలీలు మృతి

by  |
ఘోర రైలు ప్రమాదం.. 17 మంది వలస కూలీలు మృతి
X

ముంబై: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఔరంగబాద్- జల్నా మధ్యనున్న రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ విషాదకర ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాలు ఇలా.. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు రైల్వే ట్రాక్‌ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అలసిన కూలీలు ట్రాక్ మీదే నిద్రించారు. అదే ట్రాక్‌పై మృత్యు రూపంలో వచ్చిన గూడ్స్ రైలు.. వారి పైనుంచే దూసుకెళ్లింది. దీంతో వారంతా నిద్రలోనే మృత్యులోయలోకి జారుకున్నారు. మృత‌దేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను డీసీఎం‌లో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.

Tags: train accident, Aurangabad,migrant workers, dead,maharastra, 7 migrants died


Next Story

Most Viewed