భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు కరోనా కేసులు 17వేలకు దిగువన నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో 16,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 201 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కి చేరింది. ఇప్పటివరకు 1,49,850 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 99,75,958 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర [&hellip;]</p>

భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు కరోనా కేసులు 17వేలకు దిగువన నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో 16,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 201 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కి చేరింది. ఇప్పటివరకు 1,49,850 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 99,75,958 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story