క్రికెట్‌ ఫ్యాన్స్‌కు డబుల్ ఢమాకా.. ఇండియాలోనే ఐపీఎల్‌ 15

by  |
IPL
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ సీజన్ 14, టీ20 వరల్డ్‌ కప్‌ సిరీస్‌లు యూఏఈకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో‌ స్వదేశంలోనే ఐపీఎల్ సీజన్ 15‌ మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. అంతేకాదు, కొత్తగా యాడ్‌ అయిన రెండు జట్లను కలుపుకుని మొత్తం 10 జట్లు ఐపీఎల్ బరిలోకి దిగుతాయని స్పష్టం చేశారు. భారత్‌లోని ప్రముఖ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ కొత్త కాంబినేషన్‌ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నామని జై షా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. షెడ్యూల్ కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed