మళ్లీ రెచ్చిపోయిన తాలిబన్లు.. కాబూల్ ఎయిర్‌పోర్టులో 150 మంది కిడ్నాప్

by  |
Kabul airport
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టులో ఏకంగా 150 మందిని కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు. కిడ్నాపైనా వారిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. కాగా, తాలిబన్ల అరాచకంతో ఆప్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. అక్కడి ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బతకుతున్నారు. చాలా మంది దేశం విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గతకొన్ని రోజులుగా కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని విమానంలో దేశం విడిచి వెళ్లిపోతున్నారు. శనివారం కూడా తాలిబన్ల పాలన మూలంగా దేశం విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమైన భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రత్యేక విమానంలో కాబూల్ నుండి 85 మంది భారతీయులను తరలిస్తుండగా, ఒక్కసారిగా 150 మందిని కిడ్నాప్ చేసి కలకలం సృష్టించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed