మెట్‌పల్లిలో కరోనా కలకలం.. ఒకేరోజు 15 కేసులు

by  |
మెట్‌పల్లిలో కరోనా కలకలం.. ఒకేరోజు 15 కేసులు
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో కరోనా కలకలం రేగింది. ఒకే రోజు 15 కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓ కౌన్సిలర్‌తో పాటు ప్రముఖుల కుటుంబాల్లోని కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు సమాచారం. దుబ్బవాడలో నాలుగు రోజుల క్రితం జరిగిన వేడుకకు వచ్చిన వారి ద్వారానే వ్యాధి వ్యాప్తి చెందినట్టు గుర్తించిన అధికారులు కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికీ వ్యాధి నిర్దారణ అయిన వారిని క్వారంటైన్ చేసినట్టు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed