ఘోరంగా కరోనా విజృంభణ.. 8 మంది మృతి

by  |
ఘోరంగా కరోనా విజృంభణ.. 8 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విస్తృత స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,473 కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్ లోనే 506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 55,532 కు చేరుకుంది. ఇందులో 12,955 మంది బాధితులు కరోనా సోకి ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 471కు చేరుకుంది.



Next Story

Most Viewed