లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి

by  |
లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీలంకలో తీవ్ర విషాదం నెలకొంది. పస్సార పట్టణంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోగా 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 31 మందికి తీవ్ర గాయాలవ్వగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంతా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed