ఎట్టకేలకు స్వస్థలాలకు.. యూకే ప్రయాణికుల ప్రయాణం

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 136 మంది యూకే వాసులు శుక్రవారం వారి స్వదేశానికి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్ జీ కే కిషోర్ మాట్లాడుతూ టెర్మినల్ ప్రవేశించే ముందు వారందరికీ కొవిడ్ 19 పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. వారందరినీ బ్రిటిష్ ఎయిర్వేస్‌కు చెందిన ప్రత్యేక విమానంలో తరలించినున్నట్టు చెప్పారు. ఈ విమానం మొదట అహ్మదాబాద్ చేరుకుని అక్కడ మరికొందరిని ఎక్కించుకుని వెళ్తుందని తెలిపారు. బహ్రెయిన్‌కు వెళ్లి అటు [&hellip;]</p>

ఎట్టకేలకు స్వస్థలాలకు.. యూకే ప్రయాణికుల ప్రయాణం
X

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 136 మంది యూకే వాసులు శుక్రవారం వారి స్వదేశానికి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఈవో ఎస్ జీ కే కిషోర్ మాట్లాడుతూ టెర్మినల్ ప్రవేశించే ముందు వారందరికీ కొవిడ్ 19 పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్టు తెలిపారు. వారందరినీ బ్రిటిష్ ఎయిర్వేస్‌కు చెందిన ప్రత్యేక విమానంలో తరలించినున్నట్టు చెప్పారు. ఈ విమానం మొదట అహ్మదాబాద్ చేరుకుని అక్కడ మరికొందరిని ఎక్కించుకుని వెళ్తుందని తెలిపారు. బహ్రెయిన్‌కు వెళ్లి అటు నుంచి లండన్‌కు వెళ్లనున్నట్టు వివరించారు.

Tags: Telaganga govt,shamshabad Airport,Repatriated

Next Story