దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?

by  |
carona 1
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,32,364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 2,713 మంది మరణించారు. అదే సమయంలో2,07,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,40,702కు పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,65,97,655 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed