దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం

by  |
Fire Accident in kukatpally
X

దిశ,వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ఢిల్లీలోని మంగోల్ పురిలోని ఓ ఇంటి సమీపంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడుధాటికి అక్కడి ప్రదేశంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకచ్చారు. అప్పటికి ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అనుమానం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed