12మంది జూదరులు అరెస్టు

by  |

దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed