ఆన్‌లైన్ క్లాసులకు 12,639 మంది విద్యార్థులు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో ఎంసెట్, నీట్, ఐఐటీ పోటీ పరీక్షల ఆన్‌లైన్‌ తరగతులకు 12,639 మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు. వీరిలో ఎంపీసీ నుంచి 7,584 మంది, బైపీసీ నుంచి 4,971 మంది ఉన్నట్లు ఇంటర్మీడీయట్ కమిషనర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని విద్యార్థులు క్లాసులు, మాక్ టెస్టులకు హాజరు కావచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ నెంబర్లు 9299994866 లేదా 7981810755 ద్వారా ఉదయం 10.30 నుంచి సాయంత్ర 5 గంటల మధ్య సంప్రదించాలని సూచించారు.

Tags: Online class, Education, telangana, Lockdown, corona virus

Next Story

Most Viewed