దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు

by  |
carona 1
X

దిశ, వెబ్ డెస్క్ :దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కానీ కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,20,529 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,94,879కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,380 మంది మరణించారు. అదే సమయంలో1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,44,082కు పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,67,95,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.



Next Story

Most Viewed