12 మంది జూదరుల అరెస్టు..

by  |
12 మంది జూదరుల అరెస్టు..
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో పేకాట స్థావరంపై గురువారం కొల్లాపూర్ సీఐ బృందం ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కార్లు, నాలుగు బైక్‌లతో పాటు 14 సెల్ ఫోన్లు రూ.1 లక్షా 29వేల 970ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ సీఐ వెంకట రెడ్డి వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో పెద్ద సంఖ్యలో పేకాట ఆడుతున్నట్టు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ మురళిగౌడ్ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడిలో 12 మంది జూదరులను, 4 కార్లను, 4 బైకులతో సహా లక్షా 29వేల 970 నగదును స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed