సూర్యాపేటలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 11 మంది మృతి

by  |
సూర్యాపేటలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 11 మంది మృతి
X

దిశ సూర్యా పేట: జిల్లాలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుంది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో శుక్రవారం ఒక్కరోజే 11మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా రెండవ దశ ప్రారంభం నుండి జిల్లాలో రోజుకు ముగ్గురు మరణిస్తుండగా శుక్రవారం రికార్డ్ స్థాయిలో 11మంది మరణించడంతో ఆ జిల్లా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు 50సంవత్సరాల పైబడిన వారు ఉండడం గమనార్హం. వీరిలో సూర్యాపేటకి చెందినవారు నలుగురు మరణించగా, మిగిలిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.



Next Story

Most Viewed