వారి సేవలు మరువలేనివి..

by  |
వారి సేవలు మరువలేనివి..
X

దిశ, వెబ్ డెస్క్: 108 ఉద్యోగుల సేవలు మరువలేనివని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏడు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా 108 ఉద్యోగులు శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ పేషెంట్లను ఆస్పత్రులకు వారు చేర్చారని ఆయన అన్నారు. కాగా 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. 12 గంటల పని, జీత భత్యాలు, ఈపీఎఫ్ పై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సబ్ కమిటీ నివేదిక సీఎంకు అందించిన తర్వాత సమస్యలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు.

Next Story

Most Viewed