భ‌ద్రాచ‌లంలో 10 పాజిటివ్ కేసులు..

by  |
భ‌ద్రాచ‌లంలో 10 పాజిటివ్ కేసులు..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమ‌వారం 65 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 10 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇందులో భద్రాచలానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు బ్యాంకు ఉద్యోగి కాగా ఇంకొకరు ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి, ఇంకొకరు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

ఇతర ప్రాంతాలకు చెందిన వారు 7 గురు ఉన్నారు. రెండ్రోజుల క్రితం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మణుగూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతిచెందగా, ఈరోజు కరకగూడెంకు చెందిన 30ఏళ్ల వ్యక్తి కరోనాతో భద్రాచలం ఆసుపత్రిలో మృతిచెందాడు.



Next Story

Most Viewed