చంద్రబాబు పత్తిగింజలా మాట్లాడుతున్నారు :వైసీపీ ఎంపీ

by  |
చంద్రబాబు పత్తిగింజలా మాట్లాడుతున్నారు :వైసీపీ ఎంపీ
X

దిశ, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కరోనా పరిస్థితిపై కేంద్రంపై మాట్లాడలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందుతున్నాయని, కరోనాపై ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న చంద్రబాబులాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. సంగం డెయిరీలో వందల కోట్లు మింగేసిన ధూళిపాళ్ల అరెస్ట్‌ను జీర్ణించుకోలేకే ఇలా మాట్లాడుతున్నరని, ఈ కరోనా టైంలో దొంగలు దొరికితే వదిలిపెట్టాలని చంద్రబాబు పత్తిగింజలా నీతి చంద్రికలు భోదిస్తున్నారని దుయ్యబట్టారు.


Next Story

Most Viewed