అయ్యో మీనాక్షి.. ఇలా ఎందుకు చేశావమ్మా..

by  |
meenakshi
X

దిశ, నల్లగొండ : కడుపులో నొప్పి భరించలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నెపర్తిలో బుధవారం జరిగింది. ఈ ఘటనపై నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అన్నెపర్తి గ్రామం గొల్లగూడకు చెందిన కొత్తి లింగయ్య, లక్ష్మీ దంపతులు కుమార్తె మీనాక్షి(19)తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం మీనాక్షికి కడుపులో నొప్పి రావడంతో ఆమెను ఇంటి దగ్గరే ఉంచి తల్లిదండ్రులు పనికి వెళ్లారు. దీంతో, టాబ్లెట్ వేసుకున్నా బాధిత యువతికి కడుపులో నొప్పి తగ్గకపోవడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి యువతిని నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మీనాక్షి బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. యువతి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.



Next Story

Most Viewed