‘మా’ ఎలక్షన్స్.. సంచలనం రేపుతోన్న యంగ్ డైరెక్టర్ ట్వీట్

by  |
director Ajay Bhupathi
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోకుండా.. నటులు సైతం తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రెసిడెంట్ బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు సైతం వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RX100 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ‘‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత అక్టోబర్ 14న మన ‘‘మహాసముద్రం’’ సినిమా రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేగాకుండా.. ‘‘నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా.. అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు.’’ అని మరో సంచలన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed