స్నేహితుడి భార్యతో బెడ్ రూంలో దూరిన యోగి

by  |
స్నేహితుడి భార్యతో బెడ్ రూంలో దూరిన యోగి
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి మనిషి నమ్మకాన్ని చంపేస్తున్నాడు. మిత్రుడని ఇంటికి రానిస్తే మిత్రద్రోహానికి పాల్పడి వారి కుటుంబాలనే కూల్చేస్తున్నారు. స్నేహం ముసుగులో అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. విలువలను మట్టిలో కలుపుతూ దోస్త్ భార్యతో కలిసి బెడ్ రూంలో దూరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన జరిగింది.

అశోక్, యోగి ఇద్దరు ప్రాణ స్నేహితులు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్‌.ఎస్‌కి చెందిన వీరిద్దరూ పెయింటర్ పని చేస్తారు. మంచి మిత్రులు కావడంతో ఒకరింటికి మరొకరు వస్తూపోతుంటారు. ఈ క్రమంలో అశోక్ భార్యతో యోగి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అశోక్ ఇంట్లోలేని సమయంలో వచ్చి ఆయన భార్యతో గడిపి వెళ్లేవాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసున్న అశోక్ భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించాడు.

తమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన అశోక్ భార్య.. యోగి కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. అతడిని అడ్డు తొలగించుకుంటే తామిద్దరం ఎంజాయ్ చేయోచ్చని భావించారు. వారి పధకం ప్రకారం.. ఈనెల 3న (ఆదివారం) మందు పార్టీ పేరుతో అశోక్‌ను యోగి స్థానిక జడ్పీ స్కూల్ వద్దకు పిలిపించాడు. అక్కడ అశోక్‌కు ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటూ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అశోక్ కు అధికంగా మద్యం తాగించిన యోగి.. తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. సాయంత్రం వెళ్లిన కొడుకు తెల్లారినా ఇంటికి రాకపోవడంతో అశోక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రాము, ఎస్‌ఐ గోపాలుడు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో భార్య, ఆమె ప్రియుడు చేసిన దారుణం వెలుగు చూసింది. హతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed