వరదలో చిక్కుకున్న వైసీపీ నేత, మీడియా ప్రతినిధులు

by  |

దిశ, ఏపీ బ్యూరో, కాకినాడ: ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పలువురు వైసీసీ నేతలు గోదావరి మధ్యలో పంటు నిలిచిపోవడంతో చిక్కుకుపోయారు. కోటిపల్లి నుంచి ఆయినవిల్లి మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు పలువురు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు పంటులో బయలుదేరారు. కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక, వీరవల్లి పాలెం మార్గంలో అకస్మాత్తుగా ఇంజిన్ ఆగి పంటు నిలిచిపోయింది. బోటు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో నేతలు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. బోటులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరి కొందరు మీడియా ప్రతినిధులున్నారు.



Next Story

Most Viewed