యుద్ధంపై పట్టు కోల్పోయిన హమాస్‌.. గాజా పార్లమెంట్‌ను స్వాధీనం చేపుకున్న ఇజ్రాయెల్

by Disha Web Desk 12 |
యుద్ధంపై పట్టు కోల్పోయిన హమాస్‌.. గాజా పార్లమెంట్‌ను స్వాధీనం చేపుకున్న ఇజ్రాయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏర్పడిన యుద్ధం ఆరో వారంలోకి చేరింది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా 12000 లకు పైగా మృతి చెందారు. కాగా గాజాలో తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను ఎలాగైన మట్టుబెడతామని ఆ దేశ అధ్యక్షుడు పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి దొరికిన వారికి ఎక్కడికక్కడే చంపేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం యుద్ధంపై పట్టు కోల్పోయిన హమాస్ ఉగ్రవాదులు,, చేతులెత్తేశారు. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజా పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకుంది. అంతకు ముంది పలు ఆస్పత్రుల్లో ప్రజలను బంధించి వారి మధ్య తలదాచుకున్న వారిని కూడా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లో ఈ యుద్ధం ముగిసే సమయం రానుందని ఆర్మీ తెలిపింది.

Next Story

Most Viewed