- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం పల్లగట్టుతండాలో ఓ వివాహిత మహిళ అదృశ్యమయ్యింది. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… పల్లగట్టుతండకు చెందిన కరంటోతు శ్రీనుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కరంటోతు రోజాకు పెళ్లి కాగా, ఇటీవలే తన తల్లి గారి ఊరైన పల్లగట్టుతండకు జూన్ 29న వచ్చింది. మరుసటి రోజు తన తల్లి కూలీ పనుల నిమిత్తం చౌటుప్పల్కు వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో పెద్ద కుమార్తె రోజా, తన తమ్ముడు పరుశురాం ఉన్నారు. రోజా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏదో పని ఉందని తన తమ్ముడితో చెప్పి బయటకు వెళ్లి తిరిగిరాకపోవటంతో బంధువుల ఇండ్లలో వెతకగా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం నారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.