పాముకాటుతో మహిళ మృతి

by  |
పాముకాటుతో మహిళ మృతి
X

దిశ, మహబూబ్ నగర్: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాపల లక్ష్మి (45) మామిడి తోటను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తుండేది. శనివారం మధ్యాహ్నం మామిడి తోటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేయడంతో వెంటనే ఆమె భర్త సుధాకర్‌కు తెలిపింది. హుటాహుటిన వనపర్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

Next Story