కడుపు నొప్పి భరించలేక… మహిళ ఆత్మహత్య

by  |
కడుపు నొప్పి భరించలేక… మహిళ ఆత్మహత్య
X

దిశ, దేవరకొండ: కడుపు నొప్పి భరించలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దిండి మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన కుంభం శ్రీనివాసులు(36), భార్య శివలీల (26) గత సంవత్సరం నుంచి కడునొప్పితో బాధపడుతూ, పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చుయించినా తగ్గలేదు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి బసవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు.

Next Story