ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. మహిళ ఆత్మహత్య

by  |
Woman suicide
X

దిశ, కుత్బుల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్ నగర్‌కు చెందిన శంభు ప్రసాద్‌కు ఉషాదేవి(45)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(ఒక కుమారుడు, కూతురు) ఉన్నారు. గతకొంత కాలంగా వీరి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, మనస్థాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉషాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్యకు పలుమార్లు ఫోన్ చేసిన భర్త, ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో ఇంటికొచ్చాడు. అప్పటికే భార్య ఫ్యాన్‌కు వేలాడుతోంది. స్థానికుల సాయంతో కిందకిదింపిగా అప్పటికే మృతిచెందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



Next Story

Most Viewed