మద్యం వ్యాపారుల ఓవరాక్షన్..

by  |
మద్యం వ్యాపారుల ఓవరాక్షన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతరంపురం జిల్లా హిందూపురంలో మద్యం వ్యాపారులు రెచ్చిపోయారు. వైన్ షాపులో కర్ణాటక మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో తనిఖీలు చేయడానికి వచ్చిన ఎక్సైజ్ ఎస్సై సరోజపై మద్యం వ్యాపారులు దాడులకు పాల్పడ్డారు. ముందుగా మహిళా అధికారి సెల్‌ఫోన్ లాక్కుని ఆమెతో పాటు కానిస్టేబుళ్ల మీద కూడా దాడి చేశారు.

ఈ ఘటనలో మహిళా అధికారికి, సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, దాడి పాల్పడిన వారు బోయపేటకు చెందిన రౌడీషీటర్ లక్ష్మీ నారాయణ, రామాంజీలుగా గుర్తించారు. దీంతో వెంటనే వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed