గొర్రెలతో వెళ్లి శృంగారం.. భార్యను చూసి భర్త షాక్

by  |
గొర్రెలతో వెళ్లి శృంగారం.. భార్యను చూసి భర్త షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : గుట్టుగా సాగుతున్న అక్రమ సంబంధాన్ని ఓ గొర్రె బట్టబయలు చేసింది. పదేళ్లుగా మూడో కంటికి తెలియకుండా గప్ చుప్ గా కొనసాగిన రాసలీలలు గుట్టు.. గుట్ట సాక్షిగా ఊరంతా గుప్పుమన్నది. ఇద్దరి మూగ బాసలను మూగ జీవి రట్టు చేయడంతో ప్రియుడు కటకటాలపాలు కాగా.. ప్రియురాలి ఒళ్లు హునం అయింది. ఇంతకు వారి కామ క్రీడలను గొర్రె ఎలా బయట పెట్టిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని ఓ గ్రామంలో వారం రోజుల క్రితం ఈ గొర్రె ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఇళయస్వామి, పల్లవి(పేర్లు మార్చాం) దంపతులు. వీరికి పదేళ్ల క్రితం వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆటో నడుపుతుండగా.. భార్య తమకున్న గొర్రెలను సాదుతోంది. అయితే పల్లవికి వివాహానికి ముందు నుంచే ఈరోడ్ కు చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నది. పెళ్లైనా ఇద్దరు రహస్యంగా కలుసుకునే వారు. ఇలా పదేళ్లుగా తమ అక్రమ సంబంధాన్ని ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నారు.

పది రోజుల క్రితం పల్లవి గొర్రెలను మేపడానికి గ్రామ సమీపంలోని గుట్టకు వెళ్లింది. అయితే ఆమె ప్రియుడు కలుస్తానని ఫోన్ చేయడంతో రమ్మని చెప్పింది. ఇద్దరు కలిసి గుట్టపై రాసలీలలు సాగిస్తూ గొర్రెలను వదిలేశారు. అలా మేసుకుంటూ గుట్ట పక్కన్నే ఉన్న రోడ్డుపైకి గొర్రెలు వెళ్లాయి. అదే సమయంలో ఇంటికి వస్తున్న ఇళయస్వామి గొర్రెలను చూసి ఆగాడు. భార్య కోసం చూసినా ఆమె పరిసర ప్రాంతంలో కనిపించలేదు. దీంతో ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆందోళన చెందిన ఇళయస్వామి భార్యను వెతుక్కుంటూ గుట్ట వద్దకు వెళ్లాడు. అక్కడ భార్య కామక్రీడలు చూసి షాక్ తిన్నాడు. వెంటనే తేరుకోని ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించాడు. భార్య నుంచి విడాకులు ఇప్పించాలని పట్టుబట్టాడు. అయితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరు కలిసి ఉండాలని, మరోసారి తప్పు చేయకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులు సర్ధి చెప్పారు. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.


Next Story

Most Viewed