భర్తను చంపి.. ఇంటి వెనుక పూడ్చిపెట్టింది

by  |
భర్తను చంపి.. ఇంటి వెనుక పూడ్చిపెట్టింది
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భార్యే భర్తను హతమార్చి ఇంటి వెనుక పూడ్చి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చెరుకుపల్లికి చెందిన చిరంజీవి కనిపిచండంలేదంటూ ఈనెల 13న ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైన శైలిలో ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. రూ. 11 లక్షల కోసం ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టినట్లు చెప్పింది. అనంతరం పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.



Next Story

Most Viewed