- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : బాధ్యత లేని భర్త తీరుతో మనస్తాపం చెందిన భార్య తన కూతురుతో కలిసి ప్రాణాలు తీసుకుంది. పేకాటకు బానిసైన భర్త.. భార్యను పట్టించుకోక పోవడంతోపాటు ఉన్న ఇంటిని కూడా విక్రయించడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. అనంతపురంలో జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ కాలనీకి చెందిన గోపి పేకాటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో రోజు పేకాట ఆడుతూ ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. పైగా అప్పులు చేశాడు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని అప్పుల వాళ్ల ఒత్తిడి పెంచడంతో ఉన్న ఇంటిని అమ్మేశాడు. ఈ విషయమై.. భర్త గోపితో భార్య వీరమ్మ గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో మనస్తాపం చెందిన వీరమ్మ తన తొమ్మిదేళ్ల కూతురుని తీసుకుని వెళ్లిపోయింది.
ఆమె కోసం భర్త గోపి, గ్రామస్తులు వెతకగా.. గ్రామ శివారులోని చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి కోరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని భర్త గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.