సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి

by  |
సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
తెలంగాణ ఉద్యోగులుగా వరద సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. ఇంతకు ముందు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో నగరంలో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. వరదల కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని అన్నారు. అటువంటి వారికి సేవలందించడం ఉద్యోగులుగా మన అందరి బాధ్యత అన్నారు.



Next Story

Most Viewed