కరోనాను తక్కువ అంచనా వేయకూడదు…

by  |
Minister Etela Rajender
X

దిశ, వెబ్ డెస్క్:
కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేయకూడదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కరోనా నుంచి 99.5 శాతం మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. 0.5 శాతం మంది మాత్రమే చనిపోయారని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన చెప్పారు. రాబోయే పండుగలను ఇండ్లల్లోనే జరుపుకోవాలని ఆయన వెల్లడించారు. హుజురాబాద్‌లో త్వరలోనే ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కె‌ట్‌ను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తామని ఆయన అన్నారు.



Next Story

Most Viewed