మావోయిస్టుల పేరిట గోడ పత్రికలు

by  |
మావోయిస్టుల పేరిట గోడ పత్రికలు
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంబాపూర్‌లో మావోయిస్టుల పేరిట వెలిసిన గోడపత్రికలు ఆలస్యంగా వెలుగు చూశాయి. సీపీఐ (మావోయిస్టు) కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఏరియా కమిటీ పేరుతో వెలసిన ఈ గోడ ప్రతికలో గ్రామ సర్పంచ్ భర్త రమేశ్, మరో ఇద్దరు.. ప్రజలను ఇబ్బందులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. 8ఏళ్ల క్రితం మహాముత్తారం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందన్నారు. అయితే ఈ గోడ పత్రిక నకిలీదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. లేఖలో రేవూరి ప్రకాశ్ రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి‌రెడ్డి భూముల వివరాలను పేర్కొన్నారు.


Next Story

Most Viewed