‘అచ్చెన్న ఎక్కడ కక్కుతాడోనని అబ్బాకొడుకులకు నిద్ర లేదట’

by  |
‘అచ్చెన్న ఎక్కడ కక్కుతాడోనని అబ్బాకొడుకులకు నిద్ర లేదట’
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వరుస ట్వీట్టలో.. ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా.. అంటూ చిటికెలేసిన ఉత్తర కుమారుడు ముందే వచ్చాడు. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్’ అంటూ ఎద్దేవా చేశారు.

మరో ట్వీట్‌లో

‘అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బాకొడుకులకు నిద్ర పట్టడం లేదంట. అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న చంద్రబాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు విజనరీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.



Next Story

Most Viewed