రోజుకు 50 వేల పీపీఈల లక్ష్యం : వేదాంత!

by  |
రోజుకు 50 వేల పీపీఈల లక్ష్యం : వేదాంత!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతున్న స్థాయిలో రక్షణ పరికరాలు లేని సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే వైద్య రంగాన్ని ముందుగా కాపాడుకోవాలి. వైద్య రంగంలోని వారికి అవసరమైన స్థాయిలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)ను తయారు చేయడానికి దేశీయ సంస్థ వేదాంతా ప్రకటించింది. దేశంలో ఒకరోజుకు 50,000 పీపీఈల తయారీయే లక్ష్యమని సంస్థ వెల్లడించింది. మే మొదటి వారం నుంచి పీపీఈలను తయారు చేయడానికి పనులు ప్రారంభిస్తామని వేదాంతా సీఈవో రీతు తెలిపారు. దీనికోసం అవసరమైన 23 యంత్రాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి జౌళి మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకుంది. ఈ యంత్రాల ద్వారా వైద్యులకు, మెడికోలకు అవసరమైనటువంటి పీపీఈలను తయారు చేయవచ్చు. ఇవి మాత్రమే కాకుండా కొవిడ్-19ని అరికట్టేందుకు ఇప్పటికే 2 లక్షల ఎన్-95 మాస్కులను కొన్నట్లు సీఈవో రీతు పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా 50,000 పీపీఈలను సమీకరిస్తామని తెలిపారు. వేదాంత సంస్థ ఇదివరకే రూ. 201 కోట్ల విరాళం అందించిన విషయం తెలిసిందే.

Tags : vedanta, ppe, health, coronavirus, covid-19

Next Story

Most Viewed