21వేల కోట్ల డిఫెన్స్ డీల్

by  |
21వేల కోట్ల డిఫెన్స్ డీల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడి పర్యటనలో వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యానికి కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని అన్నారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారని వివరించారు. భారత్‌తో డిఫెన్స్ డీల్ చేసుకుంటామని చెప్పారు. మూడు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21వేల కోట్లు)విలువైన మిలిటరీ హెలికాప్టర్ల డీల్‌పై రేపు సంతకాలు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు ప్రధాన డిఫెన్స్ భాగస్వామిగా భారత్‌ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు


Next Story

Most Viewed