జూరాల నుంచి జలాలు విడుదల

by  |
జూరాల నుంచి జలాలు విడుదల
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్‌లోకి 56,905 క్యూసెక్కులు చేరుతుండటంతో విద్యుత్‌ కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను సోమవారం దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 43,616 క్యూసెక్కులు చేరుతుండటం ప్రస్తుతం నీటి నిల్వ 34.87 టీఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 27,574 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన జలాలు మంగళవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరనున్నాయి. వర్షాల వల్ల ఇప్పటికే జూరాల ప్రాజెక్టులోకి 6,032 క్యూసెక్కులు చేరుతుండగా ఇక్కడి నుండి నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, భీమా ఎత్తిపోతల ద్వారా 650, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 151 క్యూసెక్కులను తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం జూరాలలో 8.38 క్యూసెక్కులు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో 1.27 టీఎంసీలు అవసరం ఉండగా జూరాల నుంచి జలాలను నేడు విడుదల చేయనున్నారు. ఈ జలాలు బుధవారం శ్రీశైలం జలాశయానికి చెరుకుంటాయి. గతేడాది జూలై 30న శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రాగా ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎగువ నుంచి వరద నీరు చేరనుండటం గమనార్హం.


Next Story

Most Viewed