శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి..!

by  |
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి..!
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‎కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సాదరంగా స్వాగతం పలికి, స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించమని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకున్నట్లు చెప్పారు.

Next Story