దారుణం: ఇటుకలతో కొట్టి, కొట్టి.. చివరికి..

by  |
దారుణం: ఇటుకలతో కొట్టి, కొట్టి.. చివరికి..
X

దిశ, సిర్పూర్ సిటీ : గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్యచేసిన ఘటన కాగజ్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పట్టణంలోని తిరందాసు బస్తీకి చెందిన ప్రణీత్ అనే యువకుడు గుర్రం సంతోష్ అనే రౌడీషీటర్ హత్య కేసులో ప్రణీత్ నిందితుడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితమే బెయిల్ పై విడుదలై వచ్చాడు. అయితే ఇతన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలతో దారుణంగా కొట్టి చంపారు. పట్టణంలోని బాలాజీ నగర్ ఏరియాలో పథకం ప్రకారమే హత్య చేశారని, ఈ హత్యకు పాత కక్ష్యలే కారణం అయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాగజ్ నగర్ ఎస్ఐ కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Next Story