గుర్తుతెలియని పసికందు మృతి

by  |
గుర్తుతెలియని పసికందు మృతి
X

దిశ, కోదాడ: పంటపొలాల మధ్య గుర్తు తెలియని పసికందు మృతదేహం లభ్యమైంది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొండాపురం గ్రామ శివారులో శనివారం ఉదయం పంట పొలాల మధ్య అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న చిలుకూరు పోలీసులు ఆడపిల్ల పుట్టిందనే వివక్షతోనే తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారా..? లేక శిశువు మృతి చెందాకా పంట పొలాల మధ్య పడవేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed