టేకులపల్లిలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్..

by  |
corona
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలంలోని నైన్త్ మైల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు శనివారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు చెల్లమ్మ, కోయగూడెం అంగన్వాడీ సెంటర్‌లో పనిచేస్తున్న కోటమ్మకు కరోనా నిర్ధారణ జరిగింది. నైన్త్ మైల్ తండా స్కూల్‌లో చదువుతున్న 43 మంది పిల్లలకు టెస్టులు జరపగా అందరికీ నెగెటివ్ అని తేలింది. ఈ కరోనా పరీక్షలను మండల మేజిస్ట్రేట్ శ్రీనివాస రావు, వైద్య అధికారి నరేష్ పర్యవేక్షించారు. అంగన్వాడీ టీచర్స్-58, స్కూల్ టీచర్స్-114, మిగతావారు -12, నైన్త్ మైల్ స్కూల్ పిల్లలు-43, మొత్తం-227 మందిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. కరోనా పరీక్షల కార్యక్రమంలో లలిత, కమలా, ఎల్లమ్మ, లక్ష్మీబాయ్, రాంబాబు, కృష్ణయ్య, బుజ్జి, సర్పంచ్ ఎర్పుల బిచ్చా, కార్యదర్శి సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed