గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

by  |
car-accident-gandipet
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని గండిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సీబీఐటీ కాలేజీ రోడ్డులో కరెంట్ పోల్‌ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం. ఏపీ09 సీజే 2095 స్విఫ్ట్ డిజైర్ కారు విద్యుత్ పోల్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టగా.. ఆ సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. అయినా, కూడా ప్రాణనష్టం సంభవించింది. అంతేకాకుండా, కారులో వెడ్డింగ్ కార్డులు లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Next Story

Most Viewed