వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి

by  |
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి
X

దిశ‌, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ వ్య‌క్తిని బైక్ ఢీకొన‌డంతో తూలి రోడ్డు మీద ప‌డ్డాడు.అతను తేరుకునే లోపే వేగంగా వచ్చిన కారు పై నుంచి వెళ్లింది.తీవ్రగాయాలవ్వడంతో అతను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.ఈ ఘ‌ట‌న సోమ‌వారం భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం అంజనాపురం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..అంజనాపురం గ్రామానికి చెందిన గణపతి(53)అనే వ్యక్తిని అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్ట‌డంతో రోడ్డుపై తూలి ప‌డ్డాడు. అదే స‌మ‌యంలో వెనుక నుంచి వచ్చిన కారు అత‌ని పై నుంచి వెళ్లడంతో గ‌ణ‌ప‌తి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ మేరకు బూర్గంపహాడ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరొక ఘటనలో..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామ సమీపంలో సోమ‌వారం ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ద్విచ‌క్ర‌ వాహ‌నంపై వెళ్తున్న దారా సత్యనారాయణ(55)అక్కడిక్కడే మృతి చెందాడు.ఈ మేరకు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed