రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
X

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మణం చెందారు. ఈ ఘటన ఉంగుటూరు మండలం కైకరం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సైకిల్‌పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృత్యుఒడికి చేరాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు వలస కూలీలుగా గుర్తించారు.

Tags: road accident, westgodavary, crime news, ap



Next Story